VSP: మద్దిలపాలెం చైతన్య నగర్ కాలనీలో నిరాశ్రయురాలిగా తిరుగుతున్న 70 ఏళ్ల గోవిందమ్మను రెడ్ క్రాస్ ప్రతినిధులు గుర్తించి రక్షణ కల్పించారు. ఎంవీపీ సీఐ ప్రసాద్, బ్లూ కోర్టు సిబ్బంది సహకారంతో ఆమెను పెందుర్తిలోని లయోలా వృద్ధాశ్రమానికి సురక్షితంగా తరలించారు. పలువురు సామాజిక కార్యకర్తలు, స్థానికులు పాల్గొని ఆమెకు అండగా నిలిచారు.