E.G: రాజమండ్రిలోని RTC కాంప్లెక్స్ వద్ద ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన ఇంఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు దివ్యాంగులతో కలిసి బస్సు ప్రయాణం చేశారు. ‘దివ్యాంగ శక్తి’ పథకం ద్వారా ప్రభుత్వం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోందన్నారు.