ATP: అనంతపురం అంబేద్కర్ ఫంక్షన్ హాల్లో ప్రభుత్వం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు. హజ్ యాత్రికులకు లక్ష రూపాయల సాయం, హజ్ హౌస్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ముస్లిం సోదరుల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.