NTR: తిరువూరు శ్రీ వెంకటేశ్వర ఫిల్లింగ్ స్టేషన్ (పెట్రోల్ బంక్)ను ఆర్డీవో కుమార్ గురువారం పరిశీలించారు. ఓపెన్ స్టాక్ ఎంత ఉందో స్వయంగా పరిశీలించారు. అనంతరం నిర్వాహకులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అవి బాటిల్స్లో ఇంధనం విక్రయించకూడదన్నారు. ఆయిల్ కంపెనీలకు డీడీలు చెల్లిస్తూ ఇంధన నిల్వలు ఉంచాలని సూచించారు. ఇంధన కొరతపై పుకార్లు నమ్మొద్దని వాహనదారులకు తెలిపారు.