PPM: వీరఘట్టం మండలం పెద్దూరు ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. దశాబ్దాల కాలం కావడంతో భవనం శ్లాబు పెచ్చులు ఊడి పోయింది. దీంతో ప్రమాదం ఉన్నచోటే చదువులు కొనసాగించాల్సి వస్తోంది. ఇక్కడ 25 మంది చిన్నారులు చదువుతున్నట్లు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. వానా కాలంలో వర్షపు నీరు కారుతోందని చెబుతున్నారు. అధికారులు స్పందించి కొత్త భవనం నిర్మించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.