VZM: గజపతినగరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో దివ్యాంగశక్తి పథకాన్ని ఏఎంసీ ఛైర్మన్ గోపాల రాజు ఇవాళ ప్రారంభించారు. అంగవైకల్యం 40% పైబడిన దివ్యాంగులకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి వీటి రామారావు, ఎంపీడీవో కళ్యాణి ఆర్టిసీ అధికారి నాయుడు, టీడీపీ నేతలు గంట్యాడ శ్రీదేవి, ప్రదీప్ కుమార్, మక్కువ శ్రీధర్, బంగారు నాయుడు తదితరులు పాల్గొన్నారు.