VSP: ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం వరాహలక్ష్మి నృసింహస్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవం ఈనెల 29న జరగనుంది. ఈ సందర్భంగా స్వామివారికి ఇవాళ సాయంత్రం 3:30 గంటలకు పెళ్లి రాట మహోత్సవం నిర్వహించనున్నారు. సంప్రదాయబద్ధంగా వైదిక క్రతువులు పూర్తిచేసి భక్తుల గోవింద నామస్మరణ, మేళతాళాల మధ్య రాట ఉడుపు మహోత్సవాన్ని నిర్వహిస్తారు.
అన్నమయ్య: రాజంపేట రైల్వే స్టేషన్ రోడ్డులోని కాంప్లెక్స్ వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సమయ స్ఫూర్తితో వ్యవహరించడంతో మంటలు పక్కనే ఉన్న దుకాణాలకు వ్యాపించకుండా నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో స్థానికులు, షాపుల యజమానులు ఊపిరి పీల్చుకున్నారు.
అన్నమయ్య: రాజంపేట రైల్వే స్టేషన్ రోడ్డులోని కాంప్లెక్స్ వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సమయ స్ఫూర్తితో వ్యవహరించడంతో మంటలు పక్కనే ఉన్న దుకాణాలకు వ్యాపించకుండా నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో స్థానికులు, షాపుల యజమానులు ఊపిరి పీల్చుకున్నారు.
TPT: ఉగాది పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు కలెక్టర్ను సాదరంగా ఆహ్వానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ప్రకాశం: పామూరులోని మదన వేణుగోపాల స్వామి ఆలయంలో గురువారం ఉగాది పరాభవనామ సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు నారాయణ చార్యులు, ఈవో గిరిరాజు నర్సింహబాబు ఆలయంలో పంచాంగాలు ఆవిష్కరించడంతో పాటు చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
PLD: నరసరావుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు వద్ద పల్నాడు యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన ఆటో స్టాండ్ను ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లు సమాజానికి కీలక భాగస్వాములని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
బాపట్ల: రేపల్లెలో బాలభక్త బృందం ఆధ్వర్యంలో పాత స్టేట్ బ్యాంకు సెంటర్ వద్ద 60వ శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి శ్రీకారం చుట్టారు. గురువారం జరిగిన చలువ పందిరి గుంజ పూజలో టీడీపీ నేత అనగాని శివప్రసాద్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ మహోత్సవం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి భక్తులు, నిర్వాహకులు హాజరయ్యారు.
కృష్ణా: ఉగాది పండుగను పురస్కరించుకొని గుడివాడ మండలం జగన్నాధపురంలో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామిని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందించి, స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని ఆయనకు అందజేశారు.
BPT: వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం గ్రామంలో CC రోడ్ల నిర్మాణ పనులను గురువారం ప్రారంభించారు. ఈ నిర్మాణ పనులను గ్రామ పార్టీ అధ్యక్షులు కీర్తి పూర్ణ పరిశీలించారు. తమ ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సహకారంతో గ్రామంలో CC రోడ్లు మెరుగులు దిద్దుకున్నాయని కీర్తిపూర్ణ చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో అభివృద్ధి పరిగెడుతుందని తెలియజేశారు.
ATP: గుత్తి మున్సిపాలిటీలోని ఇంటి, దుకాణాల పన్నులు వసూలు చేయాలని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా సిబ్బందికి సూచించారు. ఇందులో భాగంగా మున్సిపాలిటీ ఆర్.ఐ ఫయాజ్, బిల్ కలెక్టర్ బాబా ఫక్రుద్దీన్ గురువారం ఉగాది పండుగ రోజున ఇంటి, దుకాణాల పన్నులను వసూలు చేస్తున్నారు. సకాలంలో ఇంటి పన్నులను చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని పట్టణ ప్రజలకు తెలిపారు.
సత్యసాయి: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం వైభవంగా జరిగాయి. సాయి కుల్వంత్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేద పండితులు శాస్త్రోక్తంగా పంచాంగ శ్రవణం చేశారు. కొత్త ఏడాదిలో వర్షాలు, పంటలు, దేశాభివృద్ధి తదితర అంశాలను భక్తులకు వివరించారు. భక్తి గీతాలాపనతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో గురువారం కట్టుపాలెం గ్రామంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీతారాముల ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీతారామచంద్రల విగ్రహాలను గ్రామంలో ఊరేగించారు. ఈనెల 26న శ్రీరామనవమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పెళ్లి రాట వేశారు. నవమి రోజున సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.
KRNL: కోసిగి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి, ఇంటర్మీడియెట్ వొకేషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్ షబానా అజ్మీ తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో PSET (Pre School Teacher Training) కోర్సు అందుబాటులో ఉందన్నారు. బాలికలు ఏప్రిల్ 2లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
సత్యసాయి: సోమందేపల్లి మండల నూతన ఎస్సైగా సుధాకర్ యాదవ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆయనకు పూలు, పండ్లు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఎస్సై పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.
KDP: కలసపాడు(M) చెన్నారెడ్డిపల్లెలో అకాల వర్షం రైతుకు తీవ్ర నష్టం మిగిల్చింది. తొండం పేరయ్య సాగుచేసిన సజ్జ పంట చేతికి వచ్చిన సమయంలోనే పూర్తిగా నేలకూలిపోయింది. ఇదే కాకుండా పొలంలో ఉన్న విద్యుత్ స్తంభం, ట్రాన్స్ ఫార్మర్ కూడా దెబ్బతినడంతో పరిస్థితి మరింత విషమించింది. ఈ నష్టంతో రైతు ఆర్థికంగా కుదేలయ్యాడు. ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని వేడుకుంటున్నాడు.