సత్యసాయి: కదిరి మండలంలోని శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వద్ద నిర్వహించిన ధ్వజారోహణం కార్యక్రమంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
ప్రకాశం: మద్దిపాడులో రూ. 5 కోట్ల వ్యాయామంతో నూతనంగా నిర్మిస్తున్నCC రోడ్లు, సైడ్ డ్రైనేజీ కాలువలను ఎమ్మెల్యే BN విజయ్ కుమార్ శనివారం పరిశీలించారు. అలాగే మద్దిపాడు – నందిపాడు గ్రామం వరకు జరుగుతున్న తారు రోడ్డు పనులను పరిశీలించారు. త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ DE కృష్ణ మోహన్, నాయకులు పాల్గొన్నారు.
KDP: పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మాధవి రెడ్డి పేర్కొన్నారు. శనివారం కడప నగరంలోని 31వ డివిజన్ పరిధిలో పాత మహిళా పోలీస్ స్టేషన్ సమీపంలో ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ చేశారు. లబ్ధిదారులకు పింఛన్లను అందజేసి, వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
KRNL: కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని ఎంపీ బస్తిపాటి నాగరాజు ఇవాళ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎంపీకి అధికారులు, అర్చకులు సంప్రదాయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్ఎన్ఎల్ టీఏసీ సభ్యులు బత్తిన జీవన్ కుమార్, చంద్రశేఖర్ ఉన్నారు.
KRNL: మనేకుర్తి గ్రామంలో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి ప్రెస్మీట్ ఇవాళ నిర్వహించారు. పేదలు,వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్లు ఆర్థిక భరోసాగా నిలుస్తున్నాయని అన్నారు. ప్రతి అర్హుడికి పారదర్శకంగా, సమయానికి పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమనిన్నారు.
తిరుపతి రూరల్ తనపల్లి వద్ద జాతీయ రహదారి విస్తరణ పనుల కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఆర్టీసీ అధికారులు TPT సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి చిత్తూరు, కాణిపాకం, బెంగళూరు వెళ్లే బస్సులను దారి మళ్లించారు. ఇవి ఇకపై తిరుమల బైపాస్ రోడ్డు అలిపిరి–టౌన్ క్లబ్ మార్గంగా హైవేపైకి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.
పార్వతీపురం పట్టణంలోని 14 వార్డు గొల్ల వీధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఇవాళ ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పంపిణీ చేశారు. అనంతరం ఆయన లబ్ధిదారులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి నెల మొదటి తేదీన కూటమి ప్రభుత్వం పెన్షన్ల ఇస్తుందని తెలిపారు.
E.G: గ్రామీణ స్థాయి నుంచి ఆరోగ్య వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించి ప్రతిష్ట పరచాలని, అప్పుడే అత్యవసర ప్రమాదాలను నివారించవచ్చని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ కె.నారాయణ తెలిపారు. శనివారం రాజమండ్రిలో కల్తీ పాల వల్ల ప్రమాద బాధితులను పరామర్శించారు. కల్తీ పాల సంఘటనలో మరణించిన వారికి రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ATP: 10th పరీక్ష ఫీజు రూ.125 ఉండగా కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి రూ.500 నుంచి రూ.2000 వసూలు చేసినట్లు AISF జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామి పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి డీఈవో ప్రసాద్ బాబు ప్రైవేట్ కళాశాలల దోపిడీని అరికట్టాలని ఆయన వినతి పత్రం ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేసిన వారిపై చర్యలు చేపట్టాలన్నారు.
సత్యసాయి: రాప్తాడు, ధర్మవరం చెరువులకు కృష్ణా జలాలందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. హంద్రీనీవా నుంచి PABR కుడి కాలువను అనుసంధానించడం ద్వారా 49 చెరువులను నింపాలని నిర్ణయించారు. MLA పరిటాల సునీత విజ్ఞప్తి మేరకు రూ.4.50 కోట్లతో అధికారులు అంచనాలు రూపొందించారు. 4.70 కి.మీ లింక్ కెనాల్ నిర్మాణం కోసం సర్వే నిర్వహించి, నివేదికను ప్రభుత్వానికి పంపనున్నారు.
GNTR: తెనాలి 13వ వార్డులో మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు శనివారం పర్యటించారు. అక్కడ మంచినీటి నాణ్యతను స్వయంగా పరిశీలించిన ఆయన, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో, ప్రభుత్వం ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ చేపట్టిందని కమిషనర్ పేర్కొన్నారు.
NLR: బుచ్చి పురపాలక సంఘం కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కౌన్సిలర్ షాహులకు నగర కమిషనర్ బాలకృష్ణ మధ్య వాదోపవాదాలు జరిగింది. ఇంటి పన్ను వసూల్లో కౌన్సిలర్లు అవగాహన కల్పించాలని నగర కమిషన్ చెప్పడంతో వైసీపీ కౌన్సిలర్ షాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో టాక్స్ వసూలు నంబర్ వన్గా ఉన్న మున్సిపాలిటీ ఇప్పుడు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.
E.G: కోరుకొండ మండలం మధురపూడి గ్రామానికి చెందిన సోడసాని శ్రీనుకి CMRF ద్వారా మంజూరైన రూ.40,541 విలువగల చెక్కును జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి శనివారం అందజేశారు. పేద ప్రజలకు CMRF ఒక వరం అని అన్నారు. పేద కుటుంబాలు వైద్యం కోసం దరఖాస్తు చేసిన వెంటనే CM చంద్రబాబు నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు.
ATP: శింగనమల MLA బండారు శ్రావణి శ్రీ శనివారం గార్లదిన్నె మండలం కృష్ణాపురం గ్రామంలో పర్యటించారు. “నమస్తే అవ్వా.. తాతా” అంటూ వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డితో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా నగదు అందజేశారు. ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు.
ASR: డుంబ్రిగూడ మండలం సొవ్వ పంచాయతీలో ఇవాళ పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. టీఎన్టీయూసీ అరకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఎం. స్వామి, వంతల నాగేశ్వరరావు సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు.