అన్నమయ్య: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి-శ్రీమతి భారతి రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచాంగ శ్రవణం నిర్వహించగా, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి పాల్గొని అధినేతకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.