KRNL: క్రిష్ణగిరి మండలం కటారుకొండలో శ్రీ గుంటి రంగస్వామి తిరునాల సందర్భంగా గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఈ.శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు టీడీపీ కార్యకర్తలు గ్రామ ప్రజలకు ఉచిత మజ్జిగ పంపిణీ చేశారు. వేసవి వేడిని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై సేవలను వినియోగించుకున్నారు.