PPM: సీతానగరం మండల కేంద్రంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయంలో ఈనెల 31 నుంచి నవనారసింహ యాగ కార్యక్రమం నిర్వహించబడునని ఆలయ అర్చకులు పీసపాటి శ్రీనివాసాచార్యులు తెలిపారు. ఆలయంలో విశ్వశాంతి, లోక కళ్యాణార్థం, బ్రహ్మోత్సవాలతో పాటు యాగ కార్యక్రమం మార్చి 31 నుంచి ఏప్రిల్ 9వ తేది వరకు 9 రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు.
CTR: మన ఊరు పట్టణం నగిరి వీధిలోని శ్రీ ప్రసన్న పార్వతి దేవి సమేత సోమేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా గురువారం స్వామివారి ఉత్తమ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. తర్వాత శైవాగమోక్తంగా వేద పండితులు వచారోహణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.
VZM: మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి సోదరులు, ప్రముఖ న్యాయవాది కోలగట్ల తమన్న శెట్టి నిన్న స్వర్గస్తులైన విషయం తెలిసిందే. ఈ మేరకు జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గురువారం వారి నివాసానికి చేరుకుని తమన్న శెట్టి పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మృతి తీరని లోటని, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
SKLM: కొత్తూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా చల్ల రవికిరణ్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా రాడ రాజు, జనరల్ సెక్రటరీగా వలురౌతు సుధాకర్, ట్రెజరర్గా చింతాడ ప్రసాద్, స్పోర్ట్స్ విభాగానికి ఎస్.హరిబాబులు ఎన్నికయ్యారు. కొత్తూరు సివిల్ కోర్ట్ బార్ అసోసియేషన్ యూనియన్ ఎన్నికల్లో ఈ నేతలు విజయం సాధించారు. వారికి పలువురు న్యాయవాదులు అభినందించారు.
మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై కనిగిరి వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్-ప్రైవేట్ బస్సు ఢీకొన్న ఘటనలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం పట్ల ఆయన విచారం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
PLD: నిత్యావసరాల కొరతతో సామాన్యుడి బతుకు ఛిద్రమవుతోంది. యుద్ధంతో వంట గ్యాస్, ఇంధనం దొరక్క వినియోగదారులు విలవిలలాడుతున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని కూలీలు పనులు మానుకుని గంటల తరబడి వద్ద క్యూలైన్లలో వేచిచూడాల్సి వస్తోంది. బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు, గ్యాస్ ఆఫీసుల ముందు బారులు తీరుతున్న బండ్లు సామాన్యుడి కష్టాలకు నిదర్శనంగా మారుతున్నాయి.
PLD: రాజుపాలెం మండలంలో ఇంటి పన్నుల వసూళ్లను నెలాఖరులోగా పూర్తి చేయాలని ఎంపీడీవో శ్రీనివాసరావు ఆదేశించారు. మొత్తం రూ.86.96 లక్షల పన్నులకు గాను, ఇప్పటివరకు రూ.83.07 లక్షలు వసూలయ్యాయన్నారు. ఇంకా రూ.14.39 లక్షల బకాయిలు ఉన్నట్లు తెలిపారు. మండల అభివృద్ధికి పన్నులే కీలకమని, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బకాయిలు చెల్లించాలని ఆయన కోరారు.
SS: ఢిల్లీ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు ‘లైఫ్ టైమ్ అచీవ్మెంట్’ అవార్డు లభించింది. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. సినీ రంగానికి ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం ప్రధానం చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు అభిమానులు, సినీ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.
NLR: మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై బాధితుల సహాయార్థం నెల్లూరు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు హిమాన్షు శుక్లా తెలిపారు. 7995575699, 08612331261 నెంబర్లకు ప్రజలు కాల్ చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాకు చెందిన 15 మంది ప్రయాణికులు ప్రమాదానికి గురైన బస్సులో ఉన్నట్లు సమాచారం.
ATP: గ్రేటర్ నోయిడాలోని శారదా విశ్వవిద్యాలయంలో తెలుగు విద్యార్థుల ఆధ్వర్యంలో ‘తరంగిణి 2026’ ఉగాది వేడుకలు గురువారం జరిగాయి. ఈ కార్యక్రమానికి అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరాయి ప్రాంతాల్లో ఉన్నా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ ఉత్సాహంగా పండుగ జరుపుకోవడం అభినందనీయమని ఆయన కొనియాడారు.
VZM: మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. రాష్ట్ర సీఎం చంద్రబాబుపై నమ్మకంతోనే పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని ఆయన చెప్పారు. విశాఖలో గూగుల్ సంస్థ, నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాటలు పడుతున్నాయని పేర్కొన్నారు.
CTR: వెదురుకుప్పం (M) బందార్లపల్లె గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ నెల 15న గుర్తుపట్టలేని స్థితిలో ఓ బాలుని మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. మృతదేహం వద్ద తాళాలు, జీన్స్ ప్యాంట్ గుండీలు, పూసలు లభించినట్టు పోలీసులు తెలిపారు. బాలుని ఆచూకీ తెలిసినవారు 9440900689 కు సమాచారం ఇవ్వాలన్నారు. వివరాలు అందించిన వారికి తగిన పారితోషకం అందిస్తామని పేర్కొన్నారు.
TPT: శ్రీకాళహస్తి మండలం ఊరందురు గ్రామంలో వెలసి ఉన్న నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి శ్రీకాళహస్తీశ్వరుడు గురువారం బయలుదేరనున్నాడు. నీలకంఠుడు అనే భక్తుడు ఊరందూరు క్షేత్రంలో శివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. ఆయన కోరిక మేరకు శివకామ సుందరి సమేతులైన నటరాజుడు నాట్యం చేయగా నీలకంఠుడు శివుడిలో ఐక్యమయ్యాడు.
మార్కాపురం జిల్లా సమీపంలోని రాయవరం వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదంలో మృతుల వివరాలు, గాయపడిన వారి పరిస్థితిని అధికారులతో కలిసి తెలుసుకుంటూ తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
NDL: కోవెలకుంట్ల మేజర్ గ్రామపంచాయతీకి సంబంధించి వేలం పాటల ద్వారా రూ.35.09 లక్షల ఆదాయం సమకూరినట్లు జిల్లా డివిజనల్ పంచాయతీ అధికారి నరసింహారెడ్డి వెల్లడించారు. బుధవారం కోవెలకుంట్లలోని పంచాయతీ కార్యాలయంలో డిప్యూటీ ఎంపీడీవో ప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో సంత మార్కెట్, దినసరి కూరగాయల మార్కెట్, కబేళా మార్కెట్ తదితర వాటికి సంబంధించి వేలం పాటలను నిర్వహించారు.