CTR: బయో-మెడికల్ వ్యర్థాలతో ప్రజారోగ్యానికి, పర్యావరణానికి జరిగే ప్రమాదాలను తగ్గించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం చిత్తూరు కలెక్టరేట్లో ప్రభుత్వ ఆసుపత్రులలో వ్యర్థాల నిర్వహణపై జిల్లా మానిటరింగ్ కమిటీ నిర్వహించారు. డీఆర్వో మోహన్ కుమార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
అన్నమయ్య: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం తెలంగాణతో చీకటి ఒప్పందం చేసుకొని ప్రజలకు అన్యాయం చేసిందన్నారు. జగన్ ప్రభుత్వంలో మొదలైన ప్రాజెక్టులను ఈ ప్రభుత్వం పూర్తి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. కడపలో రేపు జరగబోవు ఉద్యమంలో అందరూ పాల్గొనాలని కోరారు.
PPM: మార్చి 14 నుంచి 29 వరకు వివిధ జిల్లాలో క్రీడా స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి డా కె. శ్రీధర్ రావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అథ్లెటిక్స్ (మాస్టర్స్) 100, 200, 800, 1500, లాంగ్ జంప్, షాట్ ఫుట్, డిస్కస్, హై జంప్, జావెలిన్ గుంటూరు డీఎస్ఏ మైదానంలో జరుగుతాయి.
ATP: గుంతకల్లు మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో సాధారణ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చైర్పర్సన్ భవాని అధ్యక్షత వహించారు. ఎజెండాలో రూపొందించిన అంశాలను చదివి వినిపించారు. రానున్న వేసవి కాలంలో పట్టణంలో తాగునీటి సమస్య లేకుండా తగు చర్యలు తీసుకోవాలని చైర్ పర్సన్ కు మున్సిపల్ కమిషనర్ కు కోరారు.
VSP: మెడికల్ మాఫియా దోపిడీని వెంటనే అరికట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ రహిమాన్ డిమాండ్ చేశారు. శనివారం బుల్లయ్య కాలేజీ ఎదురుగా డీఎంహెచ్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాల లేమి, ప్రైవేట్ దవాఖానల్లో అవసరం లేని పరీక్షలు, భారీ ఫీజులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు.
KDP: విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని SI ఘన మద్దిలేటి పేర్కొన్నారు. శనివారం తొండూరు(మం) ఇనగలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ దిశగా కష్టపడాలన్నాడు. యూవ్ టీజింగ్ వేధింపులకు గురైతే తమకు తెలపాలన్నారు.
NDL: బనగానపల్లె పట్టణంలోని కొండపేట కాలనీలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. కొండపేట కాలనీలో చేస్తున్న పలు అభివృద్ధి పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని మంత్రి అన్నారు.
కర్నూలు: రాష్ట్ర డీజీపీ చేపట్టిన ఆపరేషన్ వజ్ర ప్రహర్ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో కర్నూలు పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. శనివారం కర్నూలు, ఆదోని, పత్తికొండ,ఎమ్మిగనూరు సబ్ డివిజన్ల పరిధిలలోని ఆయా గ్రామాలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. గ్రామంలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించాలన్నారు.
CTR: పుంగనూరు పట్టణంలోని గోకుల్ సర్కిల్ వద్ద అంతర్జాతీయ టైలర్స్ డే వేడుకల ఘనంగా నిర్వహించారు. బాణసంచా పేల్చి, అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. టైలర్స్ సంఘం అధ్యక్షులు శివానంద మాట్లాడుతూ.. టైలర్ షాపులు నిర్వహించే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైలర్స్ సంఘం సభ్యులు మధుమేగా సూరి, శీను పాల్గొన్నారు.
AKP: ఎటువంటి ఒత్తిడికి గురి కావద్దని పదవ తరగతి విద్యార్థులకు డీఈవో అప్పారావు నాయుడు సూచించారు. శనివారం పాయకరావుపేట మండలం మంగవరం జడ్పీ హైస్కూల్ను ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. ప్రశ్నా పత్రం చదివి తెలిసిన ప్రశ్నలకు ముందు సమాధానాలు రాయాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు 100 రోజుల ప్రణాళిక బాగా ఉపయోగపడుతుందన్నారు.
NTR: నందిగామ పట్టణంలోని వాసవి మార్కెట్ రామాలయంలో సీతారామ నామ సంకీర్తన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 73వ రామకోటి మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. వేద పండితులు మంత్రోచ్ఛరణల మధ్య ఆశీర్వచనం అందజేశారు. స్వామివారి విశిష్టత, రామనామ మహిమ, రామకోటి మహోత్సవం ప్రాముఖ్యత గురించి వారు వివరించారు.
VZM: గజపతినగరం గ్రామపంచాయతీలో కుళాయిల ద్వారా నీటి వృధా నివారణ చర్యలు చేపట్టాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఆరిశెట్టి ఏడుకొండలు, మండల పార్టీ అధ్యక్షుడు మేటి కోటి భాస్కరరావులు శనివారం గజపతినగరం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవోకి అందజేసిన వినతి పత్రంలో కోరారు. తాగునీటి కొళాయిలకు టాపు వాల్వు లేకపోవడంతో నీరు వృధాగా పోతున్నట్లు చెప్పారు.
సత్యసాయి: పుట్టపర్తి ఎంపీడీవో కార్యాలయంలో కలెక్టర్ శ్యాం ప్రసాద్ అధ్యక్షతన శనివారం బాల్య వివాహాల నిరోధక చట్టంపై అవగాహన సదస్సు జరిగింది. జిల్లాలోని పురోహితులు, పాస్టర్లు, కాజీలకు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పెళ్లి సమయంలో ఆధార్ కార్డు కాకుండా అమ్మాయి పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం ప్రామాణికంగా తీసుకోవాలన్నారు.
ATP: కళ్యాణదుర్గం పట్టణంలోని బీసీ బాలికల వసతి గృహాన్ని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు శనివారం తనిఖీ చేశారు. గదులు, గ్రంథాలయం, మినరల్ వాటర్ ప్లాంట్ను పరిశీలించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎలుగుబంట్ల సంచారం, వీధి దీపాల కొరతపై స్పందిస్తూ వారంలోగా కంపచెట్లు తొలగించి విద్యుత్ దీపాలు వేయిస్తానని హామీ ఇచ్చారు.
కోనసీమ జిల్లాలో కొబ్బరి ధర రోజు రోజుకి పతనం అవుతుంది. గత నెలలో ఒక్కో కొబ్బరికాయ ధర రూ. 21 నుంచి రూ. 24 వరకు పలికింది. కొబ్బరికాయ ధర రూ.16 నుంచి రూ.18కి పడిపోయిందని వ్యాపారస్తులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు తగ్గడమే ధర పతనానికి కారణమని వ్యాపారస్తులు అంటున్నారు. పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.