VSP: రామ్నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇవాళ మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించి బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు సమస్యలపై వినతిపత్రాలు అందించగా, వాటిని సంబంధిత అధికారులకు పంపించి త్వరిత చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం మంత్రి రాంబిల్లి కార్యక్రమానికి బయలుదేరారు.
VZM: వంగరలోని మడ్డువలస BR అంబేద్కర్ బాలికల గురుకులంలో ప్రవేశాలకు రేపు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాధిక శనివారం తెలిపారు. ఈ మేరకు ఉదయం 9:30 నుంచి 11 వరకు 5 వ తరగతి, 12 నుంచి 1:30 వరకు ఇంటర్మీడియట్కు పరీక్షలు జరుగుతాయన్నారు. ఫస్ట్ ఇయర్ MPCకి 50, బైపీసీకి 40 సీట్లు కేటాయించామని విద్యార్ధులు పరీక్షా కేంద్రానికి ముందుగానే చేరాలన్నారు.
TPT: అవ్వ తాతలకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తోందని గూడూరు ఎమ్మెల్యే పి. సునీల్ కుమార్ పేర్కొన్నారు. శనివారం ఆయన గూడూరు మండలం గాంధీనగర్లో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లను లబ్ధిదారులకు అందించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లను 4000 రూపాయలకు పెంచి అందజేస్తుందన్నారు.
CTR: పుంగనూరులో శ్రీకళ్యాణ వేంకటరమణ స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 5వ రోజు శనివారం ఉదయం మోహిని అవతారంలో శ్రీనివాసుడు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. భక్తులు శ్రీవారిని దర్శించగా మహిళలు కర్పూర హారతులు పట్టారు. ఇవాళ సాయంత్రం గరుడసేవ జరగనుంది. ఇందుకు సంబంధించి టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది.
CTR: గుడిపల్లె మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు షణ్ముఖ రెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం శనివారం పాల్గొన్నారు. ఇచ్చిన హామీ మేరకు పెంచిన పింఛన్ మొత్తాన్ని ప్రతినెల కూటమి ప్రభుత్వం క్రమం తప్పకుండా పంపిణీ చేస్తున్నట్టు వారు తెలిపారు. లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.
కోనసీమ: అమలాపురం మండలంలోని పాలగుమ్మి గ్రామంలో లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఎన్టీఆర్ భరోసా పథకం పెన్షన్లను శనివారం అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతినెలా సకాలంలో లబ్ధిదారులకు ప్రభుత్వం పెన్షన్లు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.
E.G: రాజానగరం మండలం స్వరూపనగర్ లో కల్తీ పాలు తాగి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన ఇసనపల్లి అర్చన కుమారుడు మనోహర్ కుటుంబాన్ని MLA బత్తుల బలరామకృష్ణ శనివారం పరామర్శించారు. అనంతరం కుటుంబానికి సీఎం చంద్రబాబు CMRF నుంచి మంజూరు చేసిన రూ.10 లక్షల చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. బాధిత కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ATP: శింగనమల మండలం వెస్ట్ నరసాపురంలో ఓ ప్రైవేట్ కంపెనీ తీరుపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బయటి ప్రాంతాల నుంచి వ్యర్థాలను తీసుకొచ్చి పంట పొలాల్లో దహనం చేస్తుండటంతో విషపూరిత పొగ వెలువడుతోంది. దీనివల్ల శ్వాసకోస ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రకాశం: మెడికల్, ఫార్మా మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ CPI ఆధ్వర్యంలో శనివారం మార్కాపురం కలెక్టరేట్లో ధర్నా చేపట్టారు. ప్రభుత్వ వైద్యశాలలో సరైన సదుపాయాలు లేవని, తద్వారా ప్రైవేట్ వైద్యశాలకు వెళ్లాలంటే పేదలు హడలిపోతున్నారన్నారు. పేద ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత అని, ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.
అన్నమయ్య: విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామాంజులు పేర్కొన్నారు. శుక్రవారం మదనపల్లెలోని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డిస్కమ్ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు, జిల్లా అధ్యక్షుడు నారాయణలతో కలసి మదనపల్లె కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. తమను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చిత్తూరు జిల్లాలో పింఛన్ల పంపిణీ ఒకరోజు ముందుగా శనివారం మొదలైంది. జిల్లాలోని 2,33,419 మంది లబ్ధిదారులకు రూ.101.30 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఉదయం 6.30 గంటల నుంచి సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు ఇంటి వద్దకు వెళ్లి నగదు అందజేస్తున్నారు.
PLD: చిలకలూరిపేట 37వ వార్డులో మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు, కౌన్సిలర్ శివకుమారితో కలిసి శనివారం పింఛన్లను పంపిణీ చేశారు. లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఒక రోజు ముందుగానే నగదు అందజేయడంపై వృద్ధులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పంపిణీ ప్రక్రియను కమిషనర్ స్వయంగా పర్యవేక్షించారు.
NTR: విజయవాడలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తూ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ డ్రైవ్లో సుమారు 4,000 కేజీల ప్లాస్టిక్ను సీజ్ చేసి, రూ.3 లక్షల జరిమానా విధించినట్లు చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ అర్జునరావు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ బదులు జ్యూట్ బ్యాగులు, పేపర్ కవర్లు వాడాలని వ్యాపారులకు అవగాహన కల్పించారు.
కృష్ణా: పామర్రు మండలం ఉరుటూరు గ్రామానికి చెందిన తాటి పర్తి కిరణ్ అనే యువకుడు బైక్పై ప్రయాణిస్తూ.. బల్లిపర్రు లాక్ అడ్డరోడ్డు వద్ద ఉన్నమూల మలుపు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో శనివారం దుర్మరణం చెందాడు. బైక్పై వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలైన కిరణ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
VZM: భీమవరంలో NTR భరోసా పింఛన్లను ఇవాళ బాడంగి MPDO శంబంగి రామకృష్ణ, బుడా ఛైర్మన్ తెంటు రాజాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలం వ్యాప్తంగా 8,244 పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటికే 6201 పింఛన్లు పంపిణీ పూర్తి చేసి జిల్లాలో మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.