• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

బాబాసాహెబ్ మృతి టీడీపీకి తీరని లోటు: గంధమనేని

CTR: బాసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఖాదర్ బాషా తండ్రి బాబాసాహెబ్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని ఎస్‌ఆర్ పురం మండల టీడీపీ అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు తెలిపారు. మృతదేహానికి ఇవాళ నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన, బాబాసాహెబ్ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

March 5, 2026 / 01:10 PM IST

‘అగ్నివీర్ నియామకాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానం’

E.G: విశాఖపట్నంలోని ఆర్మీ రిక్రూటింగ్ ద్వారా అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ నియామకాల కోసం వివాహం కాని పురుష అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. ఈనెల 13 నుంచి వచ్చేనెల 1వ తేదీ వరకు, Join Indian Army వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ విషయాన్ని అర్హత గల అభ్యర్థులు గమనించాలని సూచించారు.

March 5, 2026 / 01:10 PM IST

సత్యవేడు పరిశీలకుడిగా శ్రీమంత్ రెడ్డి

TPT: వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, తిరుపతి జిల్లాకు చెందిన సూళ్లూరుపేట మున్సిపల్ ఛైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డిని సత్యవేడు నియోజకవర్గ పరిశీలకుడిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ బలోపేతం మరియు సమన్వయం కోసం ఈ నియామకం చేపట్టినట్లు సమాచారం.

March 5, 2026 / 01:10 PM IST

దేవరపల్లిలో రూ. 35 లక్షలతో అభివృద్ధి పనులు

BPT: పర్చూరు మండలం దేవరపల్లిలో రూ. 35 లక్షల వ్యయంతో డ్రైనేజీ కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులను గురువారం స్థానిక నాయకులు, అధికారులు ప్రారంభించారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సహకారంతో ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా రహదారుల సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పుడు రోడ్ల నిర్మాణం ప్రారంభం కావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

March 5, 2026 / 01:10 PM IST

కస్తూర్బా విద్యార్థినులకు విద్యా సామగ్రి పంపిణీ

NLR: మర్రిపాడు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పదో తరగతి విద్యార్థినులకు మండల సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ సిబ్బంది విద్యా సామగ్రి అందించారు. రాబోయే పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి విద్యాలయానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థినులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

March 5, 2026 / 01:10 PM IST

గజ్జెహళ్లి బీసీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణం

KRNL: హోళగుంద మండలం గజ్జెహళ్లి గ్రామంలోని బీసీ కాలనీలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. రహదారి లేక ఇబ్బందులు పడుతున్న ప్రజల విన్నపం మేరకు సుమారు రూ.15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు ఇవాళ మంజూరయ్యాయి. ఈ పనులు ప్రారంభం కావడంతో దశాబ్దాల సమస్యకు పరిష్కారం లభించిందని గ్రామస్థులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

March 5, 2026 / 01:08 PM IST

ప్రొద్దుటూరుకు చేరుకున్న జగన్..!

KDP: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ గురువారం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ సీఎం YS జగన్ ప్రొద్దుటూరుకు చేరుకున్నారు. ఆయన బెంగళూరు నుంచి బయలుదేరి ప్రొద్దుటూరుకు వచ్చారు. అయితే, జగన్‌ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. కాగా, మరి కాసేపట్లో ఫంక్షన్ హాల్‌కు చేరుకుని వధూవరులను ఆశీర్వదించనున్నారు.

March 5, 2026 / 01:08 PM IST

ధర్మవరంలో చలివేంద్రం ప్రారంభం

సత్యసాయి: ధర్మవరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మంత్రి సత్యకుమార్ ఆశీస్సులతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని హరీష్ బాబు ప్రారంభించారు. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు, కార్మికులు, విద్యార్థుల సౌకర్యార్థం వడ్డే శ్రీనివాసులు, బోయ నరసింహులు ఆధ్వర్యంలో ఈ తాగునీటి సౌకర్యం కల్పించారు. ప్రజలకు సేవ చేయడం గొప్ప మానవతా దృక్పథమని హరీష్ బాబు పేర్కొన్నారు.

March 5, 2026 / 01:00 PM IST

ఈ నెల 8న ‘అస్మిత’ క్రీడా పోటీలు

SKLM: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8వ తేదీన నగరంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో ఉదయం 10 గంటల నుంచి ‘అస్మిత’ అథ్లెటిక్స్ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ కె.వెంకట్ ఉజ్వల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల మహిళా ఈ వెబ్‌‌సైట్ nsrs.kheloindia.gov.inలో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.

March 5, 2026 / 12:59 PM IST

తగ్గుముఖం పడుతున్న అరటి ధరలు..!

KDP: 10 రోజుల క్రితం టన్ను అరటి కాయల ధరలు రూ.26 వేలు పలికింది. ప్రస్తుతం టన్ను అరటి రూ.8 వేల నుంచి రూ.15 వేల లోపే ఉన్నాయని రైతులు తెలిపారు. దీంతో అరటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇజ్రాయిల్, ఇరాన్ దేశాల్లో యుద్ధ ప్రభావంతో అరటి ధరలు తగ్గాయని, ఎగుమతులు లేవన్న సాకుతో వ్యాపారులు, దళారులు రైతులను నిలువునా మోసం చేస్తున్నారని అన్నదాతలు వాపోతున్నారు.

March 5, 2026 / 12:54 PM IST

శ్రీ దుర్గా భోగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

NDL: గడివేముల మండలం గడిగరేవులలోని శ్రీ దుర్గా భోగేశ్వర స్వామికి ఫాల్గుణ మాసం గురువారం సందర్భంగా శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచే స్వామివారికి వివిధ రకాల అభిషేకాలు, అర్చనలు జరిగాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు దుర్గ భోగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.

March 5, 2026 / 12:53 PM IST

నేడు ఎంత మంది గైర్హాజరు అంటే..!

కర్నూలు జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షకు 436 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. మొత్తం 10,742 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 10,305 మంది మాత్రమే హాజరయ్యారని చెప్పారు. జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఆయన వెల్లడించారు.

March 5, 2026 / 12:52 PM IST

పాముల బెడద.. పిచ్చి చెట్లు తొలగింపు

NLR: బుచ్చి పట్టణంలోని ఖాజా నగర్‌లో ఉన్న గుడిపల్లి కాలువ వద్ద పిచ్చి చెట్లు ఎక్కువయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో పాములు సంచరిస్తూ ఉండడంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ సమస్యను స్థానిక టీడీపీ నాయకుడు సుభహాని అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పారిశుద్ధ్య కార్మికులు చెట్లను, కాలువలో ఉన్న చెత్తను తొలగించారు.

March 5, 2026 / 12:50 PM IST

మనస్థాపంతో ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

W.G: తణుకు పట్టణ పరిధిలోని ఇరగవరం కాలనీ రోడ్డులో నివాసం ఉంటున్న గుడ్డేటి శివరామకృష్ణ (48) గురువారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న శివరామకృష్ణ ఇటీవల కాలంలో మద్యానికి బానిస అయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్థాపంతో ఉరి వేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

March 5, 2026 / 12:50 PM IST

‘ పేదలకు ఉచిత విద్యుత్ మీటర్లు ఇవ్వాలి’

PPM: జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం చేస్తున్న పేదలకు ఉచిత విద్యుత్ మీటర్ కనెక్షన్ ఇవ్వాలని సామాజిక చైతన్య వేదిక ఉత్తరాంధ్ర కన్వీనర్ పీ.రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ఇవాళ ఐటీడీఏ వద్ద ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మాణం చేస్తున్న పేదలకు ఉచితంగా విద్యుత్ మీటర్ కనెక్షన్లను వైసీపీ ఇచ్చేది అని ఆయన గుర్తు చేశారు.

March 5, 2026 / 12:47 PM IST