E.G: గోకవరం మండలంలోని సూదికొండ గ్రామ శివారు చెరువు వద్ద కోడి పందేల శిబిరంపై పోలీసులు గురువారం దాడి చేశారు. ఈ ఘటనలో పది మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి ఐదు కోడిపుంజులు, రూ.1,820 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై బి.నాగమణి తెలిపారు. జాతరల సాకుతో గ్రామాల్లో కోడిపందేలు నిర్వహిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.