అన్నమయ్య: మదనపల్లె టౌన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్ధవరం గ్రామానికి చెందిన శ్రీకాంత్ (27) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గురువారం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, సిద్ధవరం మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇవ్వబోయి బైక్ అదుపుతప్పి కిందపడటంతో ఈ ప్రమాదం జరిగింది. కుటుంబసభ్యులు అతడిని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.