ప్రకాశం: సి.యస్.పురం మండలం మిట్టపాలెంలోని నారాయణ స్వామి దేవస్థానంలో ఉగాది పరాభవనామ సంవత్సరం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శివప్రసాదు శర్మని ఈవో శ్రీగిరిరాజు నర్సింహబాబు సత్కరించారు. సుబ్రమణ్యం పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత విష్ణుమూర్తి స్వామివారి గ్రామోత్సవం మాడవీధుల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు.