TPT: శ్రీకాళహస్తి గాలి గోపురం వద్ద ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బీజేపీ ఇంఛార్జ్ కోలా ఆనంద్ కుమార్ తన మిత్రబృందంతో కలిసి భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగాది పండుగ మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను, ప్రజలందరినీ ఒకే తాటిపైకి తీసుకువస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని భక్తులకు సేవలందించారు.