అన్నమయ్య: రాజంపేట మండలం మిట్టమీదపల్లె గ్రామంలో రూ.60 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లకు గురువారం నియోజకవర్గ ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ ప్రాధాన్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ గన్నె సుబ్బ నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.