GNTR: పొన్నూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు శుక్రవారం పట్టణంలోని కంపోస్ట్ యార్డును సందర్శించి వ్యర్థాల నిర్వహణ పనులను పర్యవేక్షించారు. సేంద్రియ ఎరువు (వర్మి కంపోస్ట్) తయారీలో జాప్యం చేయకుండా నాణ్యత పాటించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం MRF సెంటర్లో పొడి వ్యర్థాల వర్గీకరణ తీరును తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు.