ELR: ధర్మాజీగూడెం ఎరువుల వ్యాపారులతో మంగళవారం సీఐ క్రాంతికుమార్, ఎస్సై వెంకన్న అవగాహన సదస్సు నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ.. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎరువులు విక్రయించరాదని, ప్రభుత్వం నిషేధించిన రసాయనాలు, పురుగుమందులను నిల్వ ఉంచినా, అమ్మినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే వ్యాపారులు ఎలాంటి డిపాజిట్లు సేకరించకూడదని సూచించారు.