E.G: దేవరపల్లి మండలం గౌరీపట్నం (కొండగూడెం)లోని దాపర్తి చిట్టియ్య క్వారీలో పనిచేస్తున్న అవిటి యేసు (42)కు ప్రమాదవశాత్తు బుధవారం తలపై రాయి పడింది. అతడికి గాయం కావడంతో వైద్యం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. ఈ ప్రమాదంపై దేవరపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.