జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యధిక ప్రసవాలు నిర్వహించి కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించిందన్నారు. 2025 ఏప్రిల్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు 11 నెలల కాలంలో 5500 ప్రసవాల లక్ష్యాన్ని అధిగమించి, 145 శాతంతో 7982 ప్రసవాలు నిర్వహించారని తెలిపారు.