KRNL: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. పలు బంకుల్లో ఇవాళ ‘నో స్టాక్’ బోర్డులు పెట్టారు. మరోవైపు స్టాక్ ఉన్న బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కువ మంది వాహనదారులు అవసరానికి మించి కొనుగోలు చేస్తుండటంతో నిల్వలు తరిగిపోతున్నాయని, అలా చేయొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.