కృష్ణా: మచిలీపట్నంలో టీడీపీ శాశ్వత పార్లమెంటు కార్యాలయ నిర్మాణానికి నేడు అట్టహాసంగా శంకుస్థాపన జరిగింది. మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, జిల్లా అధ్యక్షులు వీరంకి గురుమూర్తి, ఎమ్మెల్యేలు ఈ వేడుకలో పాల్గొన్నారు. దశాబ్దాల నిరీక్షణ తర్వాత సొంత భవనం ఏర్పాటు కానుండటంతో కార్యకర్తలు పండుగలా వేడుక చేసుకున్నారు.