అన్నమయ్య: మార్చి 3న జరిగే చంద్రగ్రహణం సందర్భంగా రాయచోటి శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. గ్రహణ మోక్షానంతరం ఆలయ శుద్ధి, విశేష అభిషేకం అనంతరం భక్తులకు దర్శనం, తీర్థప్రసాదం అందజేయబడుతుందని ఛైర్మన్ తిరుమల మనోజ్ కుమార్, ఈఓ డి.వి. రమణారెడ్డి వెల్లడించారు.