కడప: నగరంలోని ప్రకాశ్ నగర్లో ఉన్న దాదాపు రూ. 30 కోట్ల విలువైన 22.5 ఎకరాల తమ పూర్వీకుల భూమిని టీడీపీ ఎమ్మెల్సీ రామచంద్రయ్య కబ్జా చేయాలని చూస్తున్నారని అంబవరం సహదేవరెడ్డి ఆరోపించారు. ఈభూమిపై తమకే హక్కులు ఉన్నాయని, అధికార అండదండలతో తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.