NLR: గుడ్లూరు మండలంలో శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధంగా ఉన్నట్లు ఎంపీడీవో వెంకటేశ్వరరావు తెలిపారు. మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. సాధ్యమైనంత వరకు శనివారం అందరికీ పెన్షన్లు పంపిణీ చేసేందుకు సిబ్బంది సన్నద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు.