E.G: గోదావరిలోకి దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాజమండ్రిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. రావులపాలానికి చెందిన జాగ్రత్ యువరాజు(24) బీటెక్ చదివాడు. ఇటీవల అతడు ఖాళీగా ఉంటున్నాడని తండ్రి నూకరాజు మందలించడంతో ఈ నెల 27న ఇంటి నుంచి అలిగి వెళ్లిపోయాడు. కాగా, ఆదివారం అతడు స్థానిక గోదావరి గట్టు ధోబి ఘాట్ వద్ద శివమై తేలాడు.