అన్నమయ్య: మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో మంగళవారం ‘జాతీయ గ్లకోమా వారోత్సవాలు’ నిర్వహించారు. కంటిలో నీటి ఒత్తిడి పెరగడం వల్ల గ్లకోమా వ్యాధి వస్తుందని డాక్టర్ దివ్య తెలిపారు. 40 ఏళ్లు పైబడిన వారు, కుటుంబ చరిత్ర ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. సకాలంలో కంటి పరీక్షలు, మందులు లేదా లేజర్ చికిత్స ద్వారా దృష్టి నష్టాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు.