అన్నమయ్య: పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిని అన్నమయ్య జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎల్. రాధిక శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. టీబీ యూనిట్ రికార్డులు, నివేదికలను పరిశీలించి చికిత్స విధానాలపై అధికారులతో సమీక్షించారు. క్షయను తొలి దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని సూచించారు. వైద్య సిబ్బందికి వ్యాధి నిర్మూలనలో మరింత చురుకుదనం అవసరమని పేర్కొన్నారు.