W.G. ఆటోలో బంగారు ఆభరణాల చోరీ కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితుల అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 3.60 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే భీమవరం పట్టణంలో ఇటీవల జరిగిన ఒక దొంగతనం కేసును భీమవరం వన్ టౌన్ పోలీసులు అత్యంత సమర్థవంతంగా దర్యాప్తు చేసి, ఫిర్యాదు అందిన కేవలం 24 గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేశారు.