ప్రకాశం: మార్కాపురం జిల్లాలో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో, ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ.. దాదాపు 1200 మంది పోలీసు సిబ్బందితో పకడ్బందీ బందోబస్త్ ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాస్లు ఉన్నవారు మాత్రమే సీఎం కార్యక్రమంలో పాల్గొనాలని, పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.