NLR: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభమవుతున్న పదవ తరగతి పరీక్షలలో నెల్లూరు నగరపాలక సంస్థ మున్సిపల్ పాఠశాలలో పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచాలని మేయర్ దేవరకొండ సుజాత అశోక్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన ద్వారా మేయర్ విద్యార్థులకు ఆశీస్సులను అందజేశారు. విద్యర్థులు ఎంతో కీలకమైన పదవ తరగతి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు.