ELR: పోలవరంలో పారిశుద్ధ్య మెరుగుదల, సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర ట్రైకర్ ఛైర్మన్ బోరగం శ్రీనివాస్ స్వచ్ఛ రథం వాహనాన్ని ప్రారంభించారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ఈ వాహనం లక్ష్యమన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.