VZM: గ్రామాల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఇవాళ జిల్లా NCD అధికారి డాక్టర్ టి. జగన్ మోహన్ రావు సూచించారు. దోనుబాయి, వీరఘట్టం PHC కేంద్రాలలో నిర్వహించిన ‘ఆశా డే’ కార్యక్రమంలో ఆయన పాల్గొని, ఆరోగ్య కార్యక్రమాలు, వైద్య సేవలపై సమీక్ష జరిపారు. ముందుగా మే నెల ఆశా డే సారాంశంపై సమీక్షించారు.