AKP: నర్సీపట్నంలోని రిషి డిగ్రీ కళాశాల వేదికగా ఈ నెల 24వ తేదీన నిర్వహించనున్న మెగా జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదివారం ఆవిష్కరించారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉపాధి మేళాలో సుమారు 17 ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని, వీటి ద్వారా 1855 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఆయన వెల్లడించారు.