సత్యసాయి: పరిగి మండలం 11కేవీ పెద్దిరెడ్డిపల్లి ఫీడర్లో శుక్రవారం అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గుర్తు తెలియని వ్యక్తులు 11కేవీ లైన్ క్రింద మంటలు పెట్టడంతో ఈ అంతరాయం ఏర్పడినట్లు పరిగి ఏఈ సంజీవప్ప తెలిపారు. ప్రస్తుతం విద్యుత్ శాఖ సిబ్బంది మరమ్మతు పనులు చేపట్టి సమస్యను పరిష్కరిస్తున్నారు. త్వరలో విద్యుత్ సరఫరా చేస్తామని ఏఈ తెలిపారు.