నంద్యాల: చాగలమర్రి పట్టణంలో ఆదివారం ఉదయం టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు ముల్లా అన్సర్ భాష ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. గాంధీ సెంటర్ కూడలిలో సీనియర్ ఎన్టీఆర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించి టీడీపీ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అభిమానులు పాల్గొన్నారు.