కాకినాడ: కొత్తపల్లి మండలంలో మంచినీరు లేక మూడు గ్రామాల ప్రజలు మూడు రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న కలవల దొడ్డి, వెంకటరాయపురం, పెద్ద కలవల దొడ్డి గ్రామాల ప్రజలు మంచినీటి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మంచినీటి పైపులైన్ ధ్వంసం కావడంతో మంచినీరు రావడంలేదని ఆ గ్రామాల ప్రజలు వాపోతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు.