ASR: ముంచంగిపుట్టులోని స్థానిక వారపు సంతను అగ్రికల్చర్ మార్కెట్ ఛైర్మన్ బోరి బోరి లక్ష్మి శనివారం పరిశీలించారు. కనీస వసతులు లేక ఎండ, వానలకు ఇబ్బందులు పడుతున్నామని రైతులు, వ్యాపారులు ఆమె ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సంతలో తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అప్పలస్వామి, పోతురాజు, సుబ్బారావు పాల్గొన్నారు.