PPM: మన్యం జిల్లాలో శనివారం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం హిస్టరీ, బోటనీ పరీక్షకు 191 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు DIEO నాగేశ్వరరావు తెలిపారు. జనరల్ విద్యార్థులు 2,682 మందికి 67 మంది, ఒకేషనల్ విద్యార్థులు 2,575 మందికి 124 మంది పరీక్ష రాయలేదని వెల్లడించారు. మొత్తం 5,257 మంది విద్యార్థులకు 5,066 మంది హాజరు కాగా 191 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు.