NTR: గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం నందు ఫిబ్రవరి 11 నుంచి 25 వరకు భక్తులు కానుకలు సమర్పించారు. కాగా, దేవాలయ అధికారులు సమక్షంలో గ్రామ పెద్దలు, తదితరులు ఆరు హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని లెక్కించారు. దీంతో రూ.15.17 లక్షల ఆదాయం రాగా, వెండి 129 గ్రాములు, పది ఆస్ట్రేలియా డాలర్లు వచ్చాయన్నారు.