W.G: సీతారామపురంలో YSR విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను పది రోజుల్లో అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు పోలీసులకు అల్టిమేటం జారీ చేశారు. ఒకవేళ నిర్ణీత గడువులోగా నిందితులను పట్టుకోకపోతే, పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి దోషులను శిక్షించాలని కోరారు.