గుంటూరు: భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగజ్జీవన్ రామ్ జయంతిని తెనాలి మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు, వివిధ విభాగాల ఉద్యోగులు సిబ్బంది పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసే నివాళి అర్పించారు. సుధీర్ఘ కాలం పార్లమెంటేరియన్గా సేవలందించి దేశాభివృద్ధికి ఎనలేని కృషి చేశారని పలువురు అధికారులు తెలిపారు.