NTR: గత రెండు నెలల క్రితం టీడీపీ సీనియర్ కార్యకర్త ఇప్పిలి రాంబాబు గుండెపోటుతో మరణించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా ఆయన కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయంగా రూ.10,000 / చెక్కును నిన్న అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఏ అవసరం వచ్చిన తమను సంప్రదించాలని రాంబాబు కుటుంబ సభ్యులను కోరారు.