BPT: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ నెల 27న జిల్లాలో పర్యటించనున్నారు. జే.పంగులూరు మండలంలోని రామకూరు గ్రామంతో పాటు, కొరిశపాడు మండలంలోని పీ.గుడిపాడు, కుర్రావానిపాలెం గ్రామాలను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని, స్థానిక సమస్యలపై సమీక్ష నిర్వహించనున్నారు.