ప్రకాశం: టంగుటూరు మండలం బాపూజీ కాలనీ సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం బోలోరో బోల్తా పడింది. వినుకొండ నుంచి నాయుడుపేట వెళుతున్న బొలెరో వాహనం వెనుక టైరు పగలడంతో అదుపుతప్పి డివైడర్ను ఢీకొని పడిపోయింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. డివైడర్ పైన పడటంతో ట్రాఫిక్ సైతం అంతరాయం లేదు.