PPM: ఉండవల్లిలో మంత్రి లోకేశ్ బుధవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ విందులో మంత్రి సంధ్యారాణి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. మంత్రితో పాటు కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి, పార్వతీపురం, పాలకొండ ఎమ్మెల్యేలు విజయ్ చంద్ర, జయకృష్ణ వారి కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. ఈ ఆత్మీయ కలయిక ఎంతగానో ఆనందాన్ని కలిగించిందని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.