NZB: స్వాతంత్య్ర సమరయోధుడు షాహిద్ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మోపాల్ మండల కేంద్రంలో యోగా టీమ్ చిన్నారులు సోమవారం ఆయనకు నివాళి అర్పించారు. ముగ్గులతో ఆయన చిత్రపటాన్ని వేసి, త్యాగాలను స్మరించుకున్నారు. యోగా శిక్షకులు నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. మనుషుల్ని చంపగలరేమో కానీ.. వారి ఆదర్శాలను మాత్రం కాదు అన్న భగత్ సింగ్ మాటలు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతాయన్నరు.